ముంబై,సెప్టెంబర్ 25: సాగునీటి ప్రాజెక్ట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తమ పదవికి రాజీనామా చేశారు. అజిత్ పవార్ తన సమీప బంధువు, కేంద్ర మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపికి చెందినవారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్సీపి భాగస్వామి. తాను అవినీతికి పాల్పడలేదని . పదవికి తాను స్వచ్ఛందంగానే రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదిస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. మహారాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, అయితే, అదనంగా 0.1 శాతం ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గత పదేళ్లలో ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై చేసిన వ్యయంపై శ్వేత పత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. మంత్రి పదవి రాజీనామా చేసినప్పటికీ అజిత్ పవార్ ఎన్సీపి శానససభా పక్ష నేతగా కొనసాగుతారు. అజిత్ పవార్ తనకు చెప్పే రాజీనామా చేశారని ఎన్సీపి అధినేత శరద్ పవార్ అన్నారు. తమ పార్టీ మంత్రులు రాజీనామా చేయబోరని, ప్రభుత్వంలో తమ పార్టీ కొనసాగుతుందని ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment