ఇప్పటికిప్పుడు తేల్చం.. తెలంగాణపై కుండ బద్దలు కొట్టిన వాయలార్

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 25:  ఈ నెలాఖరులోగా తెలంగాణపైన, కాంగ్రెసులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనంపై ప్రకటనలు వెలువడుతాయంటూ జోరుగా సాగిన ఊహాగానాలు తుస్సుమనేట్టే కనబడుతోంది. అధిష్టానం జాతీయ అంశాలతోనే బిజీగా ఉందని, తెలంగాణపై ఆలోచన చేయడం లేదని  కేంద్ర మంత్రి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవి కుండ బద్దలు కొట్టేశారు.సోమవారం జరిగిన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో  తెలంగాణపై చర్చించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెసులో తెరాస విలీనంపై ప్రశ్నించగా, ఆ విషయం తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావునే అడగాలన్నారు.  కెసిఆర్ తనను కలిశారని, తెరాస విలీనం చిన్న విషయం కాదని  ఆయన అన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు