న్యూఢిల్లీ,సెప్టెంబర్ 24: వచ్చే ఏడాది నుంచి మొబైల్ ఫోన్లకు రోమింగ్ చార్జీలు తొలగిస్తున్నట్లు టెలికం మంత్రి కపిల్ సిబల్ సోమవారం వెల్లడించారు. ఇంటర్నెట్పై నియంత్రణకు ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పారు. అయితే, ఇంటర్నెట్ కారణంగా తలెత్తుతున్న సమస్యల పరిష్కారంపై ఏకాభిప్రాయం మాత్రమే కోరుతున్నామన్నారు. ఇంటర్నెట్లోని కొన్ని అంశాల్లో భావప్రకటనా స్వేచ్ఛకు పూర్తి రక్షణ ఉంటుందని అన్నారు. టెలికం కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్ మాట్లాడుతూ, స్పెక్ట్రమ్ వేలం కోసం నోటీసు ఆహ్వాన దరఖాస్తులపై (ఎన్ఐఏ) టెలికం శాఖ కసరత్తు జరుపుతోందని, ఇది పూర్తయ్యాక ఏకీకృత లెసైన్సు మార్గదర్శకాలపై పనిచేయనుందని తెలిపారు. ఏకీకృత లెసైన్సుల పని పూర్తయిన తర్వాత ఉచిత రోమింగ్పై విధి విధానాలను నిర్ణయిస్తామని వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment