Sunday, September 23, 2012

దుమ్ము రేపిన హర్భజన్: సూపర్‌-8 లో భారత్‌

కొలంబో,సెప్టెంబర్ 23: :  ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో హర్భజన్ తన స్పిన్ మాయాజాలంతో భారత్‌కు ఘన విజయ సాధించి పెట్టాడు. భారత్‌ 90 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్‌-ఎ సూపర్‌-8 లో సూపర్‌గా నిలిచింది. రోహిత్ శర్మ (33 బంతుల్లో 55; 5 ఫోర్లు, 1సిక్సర్) దూకుడుకు తోడు విరాట్ కోహ్లి (32 బంతుల్లో 40; 6 ఫోర్లు), గంభీర్ (38 బంతుల్లో 45; 5 ఫోర్లు) రాణించడంతో భారత్ 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ జట్టు భారత బౌలింగ్ ధాటికి 14.4 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. కీస్వెటర్ (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే పోరాడాడు. హర్భజన్ 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, పఠాన్, చావ్లా చెరో 2 వికెట్లు తీశారు.ఆసక్తికర అంశమేమిటంటే అదనపు పరుగులు కేవలం ఒక్కటంబే ఒక్కటే ఇచ్చారు. సూపర్‌-8 లో భారత్‌ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...