హైదరాబాద్, సెప్టెంబర్ 21: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, కొండా లక్ష్మణ్ బాపూజీ (97) హైదరాబాద్లోని తన స్వగృహలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్న బాపూజీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం ఆయన తెలంగాణ కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915లో సెప్టెంబర్ 27న జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. క్విట్ ఇండియా, నాన్ముల్కీ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో మంత్రిపదవినే వదులుకున్నారు. ఇటీవలే నవ తెలంగాణ ప్రజాపార్టీని స్థాపించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక రాష్ట్రసాధన కోసం కృషిచేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment