స్వాతంత్ర్యయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతి...

హైదరాబాద్, సెప్టెంబర్ 21:  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ (97)  హైదరాబాద్‌లోని తన స్వగృహలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్న బాపూజీకి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం ఆయన తెలంగాణ కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడి గ్రామంలో 1915లో సెప్టెంబర్‌ 27న జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. క్విట్‌ ఇండియా, నాన్‌ముల్కీ ఉద్యమాలలో  కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో మంత్రిపదవినే వదులుకున్నారు. ఇటీవలే నవ తెలంగాణ ప్రజాపార్టీని స్థాపించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ ప్రత్యేక రాష్ట్రసాధన కోసం కృషిచేశారు. 

 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు