న్యూఢిల్లీ,సెప్టెంబర్ 21: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యూపీఏకు మద్దతు ఉపసంహరిస్తూ రాసిన లేఖను ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందచేశారు. ప్రజావ్యతిరేక విధానాల వల్లే యూపీఏకు మద్దతు ఉపసంహరించుకున్నట్లు మమతా బెనర్జీ ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. యూపీఏ కూటమిలో తమదే పెద్దపార్టీ అని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయం పై తమని సంప్రదించలేదని తెలిపారు. మెజారిటీ నిరూపించుకోవాలని యూపీఏను తాము డిమాండ్ చేయడం లేదని పేర్కొన్నారు. తమ వ్యతిరేకత అంతా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపైనేనని ఆమె స్పష్టం చేశారు. కాగా తృణమూల్ కాంగ్రెసు పార్టీ మంత్రులు ఆరుగురు --ముకుల్ రాయ్, సౌగత రాయ్, శిశిర్ అధికారి, మోహన్ జాతౌ, సుల్తాన్ అహ్మద్, సుదీప్ బందోపాధ్యాయ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు విడిగా తమ రాజీనామాలు సమర్పించారు. వారి రాజీనామాలను మన్మోహన్ సింగ్ వెంటనే ఆమోదించారు. టిఎంసికి 19 మంది ఎంపీలు ఉండగా అందులో ఆరుగురు మంత్రులుగా ఉన్నారు.
బెంగాల్ లో కాంగ్రెస్ కౌంటర్...
ఇటు కేంద్రంలో టిఎంసి మద్దతు ఉపసంహరించుకోగానే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెసు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మమతా బెనర్జీ మంత్రివర్గంలోని కాంగ్రెసు మంత్రులు శనివారం రాజీనామా చేసే అవకాశం ఉంది.
బెంగాల్ లో కాంగ్రెస్ కౌంటర్...
ఇటు కేంద్రంలో టిఎంసి మద్దతు ఉపసంహరించుకోగానే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెసు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మమతా బెనర్జీ మంత్రివర్గంలోని కాంగ్రెసు మంత్రులు శనివారం రాజీనామా చేసే అవకాశం ఉంది.
No comments:
Post a Comment