న్యూఢిల్లీ,సెప్టెంబర్ 14: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా వేసింది.సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ కాపీని ఇంకా పరిశీలించాల్సి ఉందన్న తదుపరి విచారణను వాయిదా వేసింది. జగన్ మోహన్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు గోపాల్ సుబ్రహ్మణ్యం, అల్తాఫ్ వాదనలు వినిపించారు. రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ సీబీఐ ఆరోపణలు చేసిందని... తీరా ఛార్జ్ షీటుకు వచ్చేసరికి అంకెలన్నీ జారిపోతున్నాయన్నారు. జగన్ అరెస్టై ఇప్పటికే వంద రోజులకు పైగా జైల్లో ఉన్నారని న్యాయవాదులు పేర్కొన్నారు. ఆయన అరెస్ట్ కు ముందు మూడు ఛార్జిషీట్లు దాఖలు చేశారని, అరెస్ట్ చేశాక సప్లిమెంటరీ వేస్తామని సీబీఐ చెప్పినా... ఇప్పటివరకూ సప్లిమెంటరీ వేయలేదని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. సప్లిమెంటరీ వేయటానికి సీబీఐ ఇంకా ఎన్నిరోజులు సమయం తీసుకుంటుందని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతోనే జగన్ పై కుట్ర పన్నారని వారు వాదించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment