హైదరాబాద్, సెప్టెంబర్ 29: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం నిర్వహించిన జీశాట్-10 ప్రయోగం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం వేకువ జామున 2.48 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 ఉపగ్రహ వాహక నౌక ద్వారా జీశాట్-10 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఇది ‘ఇస్రో’ చేపట్టిన 101వ ప్రయోగం కాగా, జీశాట్-10 ఉపగ్రహం ఇప్పటి వరకు భారత్ ప్రయోగించిన ఉపగ్రహాల్లో అత్యంత బరువైనది. దీని బరువు 3400 కిలోలు. అత్యంత బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించే రాకెట్ పరిజ్ఞానం ‘ఇస్రో’ వద్ద లేకపోవడంతో, దీనిని ఫ్రెంచి గయానా నుంచి ప్రయోగించారు. ఉపగ్రహం తయారీ సహా ఈ ప్రయోగానికి మొత్తం రూ.750 కోట్ల ఖర్చు అయింది. ముందుగా నిర్ణయించినట్లే 30.45 నిమిషాల్లో ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. జీశాట్-10 ఉపగ్రహంలో మొత్తం 30 ట్రాన్స్ పాండర్లను అమర్చారు. ఈ ప్రయోగం ఈనెల 22న జరగాల్సి ఉండగా, ఏరియన్-5 రాకెట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో, వారం రోజులు వాయిదా పడింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment