జీశాట్-10 ప్రయోగం విజయవంతం...

హైద‌రాబాద్, సెప్టెంబర్ 29:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం నిర్వహించిన  జీశాట్-10 ప్రయోగం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం వేకువ జామున 2.48 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 ఉపగ్రహ వాహక నౌక ద్వారా జీశాట్-10 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఇది ‘ఇస్రో’ చేపట్టిన 101వ ప్రయోగం కాగా, జీశాట్-10 ఉపగ్రహం ఇప్పటి వరకు భారత్ ప్రయోగించిన ఉపగ్రహాల్లో అత్యంత బరువైనది. దీని బరువు 3400 కిలోలు. అత్యంత బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించే రాకెట్ పరిజ్ఞానం ‘ఇస్రో’ వద్ద లేకపోవడంతో, దీనిని ఫ్రెంచి గయానా నుంచి ప్రయోగించారు. ఉపగ్రహం తయారీ సహా ఈ ప్రయోగానికి మొత్తం రూ.750 కోట్ల ఖర్చు అయింది. ముందుగా నిర్ణయించినట్లే 30.45 నిమిషాల్లో ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. జీశాట్-10 ఉపగ్రహంలో మొత్తం 30 ట్రాన్స్ పాండర్లను అమర్చారు. ఈ ప్రయోగం ఈనెల 22న జరగాల్సి ఉండగా, ఏరియన్-5 రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, వారం రోజులు వాయిదా పడింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు