Sunday, September 30, 2012

ఉద్రిక్తత మధ్య సాగరహారం

హైదరాబాద్,సెప్టెంబర్ 30: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ... టి. జె.ఎ.సి. ఆదివారం నిర్వహించిన తెలంగాణ మార్చ్ ఉద్రిక్తతల మధ్య సాగింది.   తెలంగాణ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు నెక్లెస్ రోడ్డు కవాతుకు తరలి వచ్చారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ తెలుగుదేశం పార్టీలు, పలు ప్రజా సంఘాలు తెలంగాణ మార్చ్ కు మద్దతిచ్చాయి. నెక్లెస్ రోడ్డు, పివి ఘాట్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్  ప్రాంతాలు  జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావలసిన న సాగరహారం  రెండున్నర, మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.  వివిధ జిల్లాల నుండి వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు ఎక్కడికక్కడ కి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వైపుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు, తెలంగాణవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణవాదులు బారీకేడ్లు తొలగించి, ముళ్లకంచెలు పెకిలించి వేదిక వద్దకు ర్యాలీగా వచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ దశలో పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. తెలంగాణవాదులు కూడా పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మీడియా ఓబి వ్యాన్లకు, నెక్లెస్ రైల్వే స్టేషన్‌కు, రెండు పోలీసు జీపులకు నిప్పు అంటించారు.తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నంలో రెండుసార్లు అరెస్టయ్యారు. సాయంత్రం కవాతు వేదిక వద్దకు వస్తున్న ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని తదితరులను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.  బైక్ ర్యాలీతో కవాతు వేదిక వద్దకు బయలుదేరిన  ఓయు విద్యార్థులపై  పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. డిజిపి దినేష్ రెడ్డి  ఏరియల్ సర్వే ద్వారా నగరంలో పరిస్థితిని పర్యవేక్షించారు. తెలంగాణ మార్చ్ నేపథ్యంలో జంట నగరాల్లో అన్ని తెలుగు వార్తా ఛానెళ్ళు పోలీసుల ఆదేశాల మేరకు   సాయంత్రం నుంచి ప్రసారాలనునిలిపివేశాయి.. తెలంగాణ కవాతు నుంచిఎవరూ వెనక్కు వెళ్లవద్దని కోదండరాం పిలుపునిచ్చారు. ప్రభుత్వ, పోలీసుల తీరుకు నిరసనగా సోమవారం వరకు రేపటివరకు నెక్లెస్ రోడ్డులోనే ఉంటామని స్పష్టం చేశారు.
కాగా సయంత్రం భారీ వర్షంలో తెలంగాణ మార్చ్ కొనసాగుతోంది. వర్షం కురుస్తున్నా తెలంగాణవాదులు నెక్లెస్ రోడ్డులోని సభా వేదిక వద్ద నుంచి కదల లేదు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...