గణేశ నిమజ్జనం ప్రశాంతం...

హైద‌రాబాద్, సెప్టెంబర్ 29:  జంట నగరాలలో గణేశ నిమజ్జనోత్సవం శనివారం ప్రశాంతంగా ముగిసింది.  జంట న‌గ‌రాల్లో  వివిధ ప్రాంతాల నుంచి  వినాయ‌క విగ్రహాలను భారీ ఊరేగింపులతో  ట్యాంక్‌బండ్ వ‌ద్దకు తీసుకు వచ్చి హుస్సేన్ సాగ‌ర్‌లో నిమజ్జనం చేశారు.భారీ బందోబ‌స్తు న‌డుమ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా శాంతియుతంగా గ‌ణేశ  నిమ‌జ్జనోత్సవం జ‌రిగింది. ఆదివారం తెలంగాణ మార్చ్ ను దృష్టిలో పెట్టుకుని నిమజ్జనోత్సవ వేడుకలను త్వరితగతిన పూర్తి చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఖైరతాబాద్ మ‌హా గ‌ణ‌ప‌తి  నిమ‌జ్జనోత్సవం  తెల్లవరు ఝామున 2.35 నిమిషాల‌కు పూర్తైంది. హుస్సేన్ సాగ‌ర్‌లో తెల్లవారు జాము వర‌కూ.. సుమారు 3 వేల విగ్రహాలు నిమ‌జ్జన‌మయ్యాయి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు