ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం...
హైదరాబాద్,ఆగస్ట్ 27: ఎంసెట్ ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. రెండు లక్షల మంది విద్యార్థులు ఇంటర్నెట్లో ఈ కౌన్సెలింగ్లో పాల్గొంటున్నారు. వచ్చే నెల 6వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఇందు కోసం 53 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు 15వేల ర్యాంకులోపు విద్యార్ధుల సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. కీలకమైన ఆప్షన్ల ప్రక్రియ ఈనెల 30 నుంచి జరుగుతుంది. ఆప్షన్ల విషయంలో గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొత్త మార్పులు చేశారు. పాస్వర్డ్ తో పాటు విద్యార్థులకు ప్రత్యేక కార్డు ఇస్తారు.
Comments