Sunday, August 26, 2012

అండర్ - 19 వరల్డ్ కప్ విజేత భారత్

టౌన్స్ విల్లే (ఆస్టేలియా),  ఆగస్ట్ 26::  టోనీ ఐర్లాండ్ మైదానంలో జరుగుతున్ అండర్ - 19 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆస్టేలియా పై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రపంచ నెంబర్ వన్‌గా అవతరించింది. కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ 130 బంతుల్లో (111) పరుగులు చేయగా...స్మిత్ పటేల్  62 పరుగులు చేశాడు. 226 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 47.4 ఓవర్లలో  227 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని అందించింది. అంతక ముందు ఆస్టేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను 8 వికెట్లను కోల్పోయి 225 పరుగులు చేసింది. అండర్ 19 వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలు సాధించిన టీమిండియా కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు మ్యాన్ ఆప్ ద మ్యాచ్ అవార్డు లభించింది.  ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుని ఆస్టేలియా కెప్టెన్ బొసిస్టో అందుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...