Monday, July 30, 2012

భారత బాక్సర్ సమిత్ సంగ్వాన్ ఓటమి వివాదాస్పదం

లండన్, జులై 30:  ఒల్యంపిక్స్ లో భారత బాక్సర్ సమిత్ సంగ్వాన్  వివాదస్పద పరిస్థితుల్లో ఓటమిపాలయ్యాడు. 81 కిలోల కేటగిరి విభాగంలో పోటీ పడిన సుమిత్ అంపైర్ల తప్పుడు నిర్ణయాల కారణంగా బ్రిజిల్ యామగుచి ఫాల్కావో ఫ్లోరెంటినో చేతిలో 14-15 స్కోరుతో  పరాజయం పాలయ్యాడు. చివరి వరకు పోరాడిన 19 ఏళ్ల సుమిత్.. అంపైర్ల నిర్ణయాల కారణంగా కీలక పాయింట్లు కోల్పోయాడు. అంపైర్ల నిర్ణయాలపై  ఈఎస్ పీఎన్ కామెంటేటర్లు మండిపడ్డారు. సుమిత్ కు జరిగిన అన్యాయాన్ని 'పట్టపగలే జరిగిన దోపిడి'గా అభివర్ణించారు. కాగా, సుమిత్ సంగ్వాన్ వివాదస్పద ఓటమి తీరుపై భారత్ కూడా తీవ్రంగా  స్పందించింది. దీనిపై  ఒలంపిక్ నిర్వాహకులకు భారత క్రీడా మంత్రి అజయ్ మాకెన్ ఫిర్యాదు చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...