Monday, July 30, 2012

బ్యాడ్మింటన్‌లో జ్వాల-అశ్వని జోడీ విజయం

లండన్, జులై 30: ఒలింపిక్స్  మహిళల బ్యాడ్మింటన్‌లో గుత్తా జ్వాల-అశ్వని పొన్నప్పల జోడీ  విజయం సాధించారు. జ్వాల జోడి 23-25, 20-12, 21-18 తేడాతో చెంగ్-చియాస్‌  పై విజయం సాధించారు. ఇప్పటికే మహిళల డబుల్స్ లో ఒక మ్యాచ్‌లో ఓడిన గుత్తా-అశ్వని జోడీ  ఈ విజయానికి తీవ్రంగా శ్రమించారు.
దూసుకుపోతున్న సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో  ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సైనా మరో అడుగు ముందుకేసింది. బెల్జియం క్రీడాకారిణి టాన్‌లీ పై సైనా నెహ్వాల్ 21-4, 21-14 తేడాతో విజయం సాధించి  రెండో గెలుపును తన ఖాతాలో వేసుకుంది.
హాకీ లో భారత్ ఓటమి
ఒలింపిక్స్  లో  భాగంగా సోమవారం జరిగిన తొలి హాకీ మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసింది.   2-3 తేడాతో నెదర్లాండ్ చేతిలో ఓడొపోయింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...