నిమ్మగడ్డకు బెయిల్ నిరాకరణ

 హైదరాబాద్ ,జులై 30: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నిందితుడు ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్‌ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు  తిరస్కరించింది. వాన్‌పిక్ వ్యవహారంలో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని సిబిఐ కోర్టులో వాదించింది. అయితే, సిబిఐ ఇప్పటికే సాక్ష్యాలను సేకరించిందని చెబుతూ తాను దర్యాప్తునకు సహకరించినందున బెయిల్ ఇవ్వాలని నిమ్మగడ్డ ప్రసాద్ కోరారు. ఇరువైపులా సాగిన సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద రావు నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. వైయస్ జగన్ సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ 842 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. అందుకు ప్రతిఫలంగా ఆయన వాన్‌పిక్ పేరిట ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వేల ఎకరాలు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పొందినట్లు సిబిఐ ఆరోపించింది.  నిమ్మగడ్డ ప్రసాద్‌కు అనుకూలంగా అధికారి బ్రహ్మానంద రెడ్డి వ్యవహరించారని, వీరిద్దరు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ పేర్కొంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు