వివాహ రిజిస్ట్రేషన్ సులభతరం

హైదరాబాద్,ఏప్రిల్ 27: హిందూ వివాహ రిజిస్ట్రేషన్లలో కీలక సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం వివాహం జరిగిన నెల రోజు ల్లో రిజిస్టర్ చేయించుకోవాలి. అంతకు మించితే సహేతుకమైన కారణాలు చూపుతూ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవడం, పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హిందు వివాహచట్టం నిబంధనలను ప్రభుత్వం సవరించింది. నెల రోజులు దాటితే ఉన్నతాధికారుల ఆమోదం తీసుకోవాలన్న నిబంధనను ఎత్తివేసింది. దీంతో వివాహం అయిన తర్వాత ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవ చ్చు. అలాగే పేర్లలో తప్పులు దొర్లితే.. వాటిని సవరించుకునేందుకు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళితే సరిపోతుంది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు