బంగారు లక్ష్మణ్‌కు నాలుగేళ్ల జైలు

న్యూఢిల్లీ,ఏప్రిల్ 28:  ఆయుధ డీలరు నుంచి లక్ష రూపాయల లంచం తీసుకున్న కేసులో బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు ఢిల్లీ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. లక్ష రూపాయల జరిమానా కూడా చెల్లించాలని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కన్వల్ జీత్ అరోరా తీర్పు చెప్పారు. 2001లో తెహెల్కా డాట్ కామ్ న్యూస్ పోర్టల్ ‘ఆపరేషన్ వెస్టెండ్’ పేరుతో చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో లక్ష రూపాయల లంచం తీసుకుంటూ లక్ష్మణ్ దొరికిపోయారు. ఈకేసులో ఆయనను దోషిగా నిర్దారించిన కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు