హైదరాబాద్,ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు తేల్చిచెప్పారు. ఏ పార్టీ అయినా వచ్చి టీఆర్ఎస్లో విలీనం కావాల్సిందేనని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరిలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణను సాధించేదాకా, సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా పునర్నిర్మాణం చేసేదాకా టీఆర్ఎస్ ఉంటుందన్నారు.
జాతీయస్థాయిలో బలమైన శక్తిగా ఎదుగుతామని కేసీఆర్ ప్రకటించారు. స్వీయ రాజకీయ అస్తిత్వం సంతరించుకుంటేనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమని, ఆ దిశగా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వంకోసం పౌరసమాజమంతా ఐక్యం కావాలని విజ్ఞప్తి చేశారు. పోరాటమైనా, ఉద్యమమైనా, సంక్షోభమైనా, రాజకీయమైనా సందర్భం ఏదన్నాగానీ తెలంగాణ ఐక్యతను ప్రదర్శించాలన్నారు. జూన్ ఆరంభంలో తెలంగాణకోసం మహోద్యమం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహాశక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ను ఎవరూ, ఏమీ చేయలేరని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన గమ్యం ముద్దాడేదాకా పోరాటం ఆపొద్దని, ఆత్మహత్యలు చేసుకుని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. 10వేలకు పైగా ప్రతినిధులు సభకు హాజరయ్యారు.
జాతీయస్థాయిలో బలమైన శక్తిగా ఎదుగుతామని కేసీఆర్ ప్రకటించారు. స్వీయ రాజకీయ అస్తిత్వం సంతరించుకుంటేనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమని, ఆ దిశగా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వంకోసం పౌరసమాజమంతా ఐక్యం కావాలని విజ్ఞప్తి చేశారు. పోరాటమైనా, ఉద్యమమైనా, సంక్షోభమైనా, రాజకీయమైనా సందర్భం ఏదన్నాగానీ తెలంగాణ ఐక్యతను ప్రదర్శించాలన్నారు. జూన్ ఆరంభంలో తెలంగాణకోసం మహోద్యమం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహాశక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ను ఎవరూ, ఏమీ చేయలేరని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన గమ్యం ముద్దాడేదాకా పోరాటం ఆపొద్దని, ఆత్మహత్యలు చేసుకుని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. 10వేలకు పైగా ప్రతినిధులు సభకు హాజరయ్యారు.
No comments:
Post a Comment