Friday, April 27, 2012

తివారీకి పితృత్వ పరీక్ష తప్పదు...

ఉజ్వల శర్మ,రోహిత్,తో ఎన్డీ తివారీ
న్యూఢిల్లీ ,ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్  మాజీ గవర్నర్ ఎన్డీ తివారీకి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురు అయ్యింది. పితృత్వ కేసులో స్పష్టమైన సాక్ష్యాధారాల కోసం డీఎన్ఏ పరీక్షకు రక్త నమూనా ఇవ్వాల్సిందేని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. బలవంతంగా తివారీకి డీఎన్ ఏ పరీక్ష చేయించవద్దన్న సింగిల్ జడ్జి ఉత్వర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. తాను తివారీకి పుట్టానని చెబుతున్న రోహిత్ శేఖర్ సింగిల్ జడ్డి ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. నాలుగు వారాల్లో ఎన్డీ తివారీ రక్త నమూనాను ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. రోహిత్ శేఖర్ అనే యువకుడు - తివారీని తన తండ్రిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేశాడు. తన తల్లి ఉజ్వల శర్మతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న తివారీకి తాను జన్మించానని అతను వాదిస్తున్నాడు. దాంతో ఎన్డీ తివారీకి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అయితే, పితృత్వ పరీక్షలకు తివారీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అది తన ప్రైవసీని దెబ్బ తీసే చర్య అని ఆయన అభివర్ణిస్తున్నారు. తివారీకి పితృత్వ పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు నిరుడు డిసెంబర్‌లో జారీ చేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...