Friday, April 27, 2012

కన్నుమూసిన భార్యతో సెక్స్...!

చట్టం తెచ్చేందుకు ఈజిప్ట్  సన్నాహాలు
వాషింగ్టన్,ఏప్రిల్ 27:  భార్య కన్నుమూసిన తర్వాత ఆమెతో సంభోగం చేసే హక్కును భర్తలకు కట్టబెట్టే చట్టం తెచ్చేందుకు ఈజిప్ట్ దేశం సన్నాహాలు చేస్తోందిట.  ఎవరైనా చనిపోతే కన్నీటితో వీడ్కోలు పలుకుతారు. కానీ ఈజిప్ట్ లో మాత్రం భార్య కన్నుమూసిన ఆరు గంటల లోపు ఆమె భౌతికకాయంతో సెక్స్ చేసే హక్కుని భర్తకు కట్టబెట్టే వింత చట్టానికి తెరతీస్తోందట. ఈ చట్టానికి ''ఫేర్‌వెల్ ఇంటర్‌కోర్స్ డ్రాఫ్ట్ లా''  (వీడ్కోలు సంభోగానికి ముసాయిదా చట్టం) అనే  పేరు పెడుతున్నారుట... ఈ చట్టానికి సంబంధించి తమ ఆందోళనలను వ్యక్తం చేస్తూ అక్కడి నేషనల్ కౌన్సిల్ ఫర్ విమెన్ అధ్యక్షురాలు డాక్టర్ మెర్వత్ అల్ తలావీ ఈజిప్షియన్ పీపుల్స్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ సాద్ అల్ కతాత్నికి లేఖ రాసినట్టు స్తానిక పత్రిక ప్రచురించింది.  ఈ చట్టంతో పాటు ఎర్లీ మ్యారేజ్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఎర్లీ మ్యారేజ్, సెక్స్ ఆఫ్టర్ డెత్ చట్టాలు తీసుకు రావొద్దని ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయిట. .

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...