Saturday, April 28, 2012

తెహెల్కా దోషి బంగారు లక్ష్మణ్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్ 27:  తెహెల్కా కుంభకోణం కేసులో బిజెపి నాయకుడు బంగారు లక్ష్మణ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. 2001లో లక్ష రూపాయలు తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ తెహెల్కా స్టింగ్ ఆపరేషన్‌కు  దొరికిపోయారు. అప్పటి నుంచి 11 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. బంగారు లక్ష్మణ్‌కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకుని తీహార్ జైలుకు తరలించారు. కోర్టు తీర్పు తర్వాత బంగారు లక్ష్మణ్ కోర్టు హాల్లో కంటతడి పెట్టారు. శనివారంనాడు ఆయనను కోర్టులో ప్రవేశపెడతారు. బంగారు లక్ష్మణ్‌కు విధించే శిక్షను ఢిల్లీ కోర్టు  ఖరారు చేస్తుంది. స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడినప్పుడు బంగారు లక్ష్మణ్ బిజెపి జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కుంభకోణంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బంగారు లక్ష్మణ్ అంచెలంచెలుగా పార్టీ జాతీయాధ్యక్షుడి దాకా ఎదిగారు. అయితే, తెహెల్కా చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌తో ఆయన జాతకం తిరగబడింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...