అహ్మదాబాద్,ఏప్రిల్ 11: గోద్రా ఘటన అనంతర గుజరాత్ అల్లర్లలో గుల్బర్గ్ ఊచకోత కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి.. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో మోడీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లభించలేదని, కాబట్టి కేసును మూసివేయాలని సిట్ సూచించింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ చేసిన ఫిర్యాదులో పేర్కొన్న 58 మందిలో ఎవరూ నేరం చేసినట్లు రుజువుకాలేదని సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎం.ఎస్.భట్ వెల్లడించారు. 2002 నాటి అల్లర్ల సందర్భంగా జరిగిన గుల్బర్గ్ సొసైటీ ఊచకోత ఘటనలో 69 మంది మృతుల్లో ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి నరేంద్రమోడీతో పాటు మరో 57 మందిపై నేరపూరిత కుట్ర ఆరోపణలు చేస్తూ.. ఎహ్సాన్ భార్య జాకియా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇస్తూ.. సిట్ నివేదికను, సంబంధిత పత్రాలను 30 రోజుల్లోగా జాకియాకు అందించాలని ఆదేశించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment