Wednesday, April 11, 2012

ఇండోనేషియాలో భారీ భూకంపం...ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ప్రకంపనలు

జకర్తా,ఏప్రిల్ 11: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.9 గా నమోదైంది. భూకంప తీవ్రతకు సుమత్రా దీవి వణికింది. ఇండోనేషియాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. బందా ఏస్ ప్రాంతానికి 495 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్రం లోపలి భాగంలో 33 కిలోమీటర్ల అడుగున భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు ఇండోనేషియా వాతావారణ శాఖ వెల్లడించింది.
భారత్‌లో ప్రకంపనలు
ఇండోనేషియాలో సంభవించిన భూకంప  ప్రభావం దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలోను, , అసోంపైన   చూపింది.  గుంటూరు, విజయవాడ, నెల్లూరు, విశాఖ, విజయనగరం, తాడేపల్లిగూడెం, తిరుపతి, కాకినాడ, అనకాపల్లిలో స్వల్పంగా సుమారు 30 సెకన్లపాటు భూమి కంపించింది.
సునామీ ముప్పు లేదు
భారతదేశానికి సునామీ ముప్పు ఉందని భావించి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలను ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉపసంహరించుకుంది. భారత్‌కు సునామీ వస్తుందనే వస్తుందనే సమాచారాన్ని నమ్మవద్దని ఎన్ఎండిఎ అంతకు ముందు సూచించింది. హిందూ మహా సముద్రంపై సునామీ ప్రభావం లేదని, అండమాన్ నికోబార్ దీవులకు కూడా ప్రమాదం లేదని జాతీయ విపత్తుల సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...