Tuesday, April 10, 2012

రబ్బానీ ఓవరాక్షన్...శాఖ మార్పు...?

ఇస్లామాబాద్ ,ఏప్రిల్ 10:    పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ మంత్రిత్వ శాఖ మారే అవకాశాలు కనపడుతున్నాయి. అమెరికా దౌత్యవేత్త సమక్షంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో విభేదిస్తూ మాట్లాడినందుకు ఆమెను  విదేశాంగ శాఖ నుంచి తప్పించగలరనే  ప్రచారం ఊపందుకుంది. ప్రధాని యూసుఫ్ రజా గిలానీ వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి.  గిలానీ ఇటీవల మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ,  కొత్త టీమ్ కాశ్మీర్ తదితర విషయాలపై భారత్‌తో సంప్రదింపులు జరుపుతుందని అన్నారు. దీన్ని బట్టి రబ్బానీ శాఖ మారడం ఖాయమని భావిస్తున్నారు. కాగా, అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి థామస్ నీడేస్‌తో కూడిన ప్రతినిధి బృందం పాకిస్తాన్ సందర్శించినప్పుడు రబ్బానీ జర్దారీతో విభేదించి అందరినీ ఆశ్చర్యపరిచారు.చికాగోలో మేలో అఫ్గనిస్తాన్‌పై జరిగే సదస్సులో పాకిస్తాన్ పాల్గొనే విషయాన్ని నీడేస్ ప్రస్తావించారు. వాషింగ్టన్ ఆహ్వానం పంపితే తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని జర్దారీ చెప్పారు. రబ్బానీ మధ్యలో జోక్యం చేసుకుని---పాకిస్తాన్ - అమెరికా సంబంధాలపై కొనసాగుతున్న సమీక్ష  తర్వాతనే చికాగో సమావేశంపై నిర్ణయం తీసుకుంటామని  చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...