Sunday, April 29, 2012

ఏమిటీ కలయిక ఆంతర్యం...!?

హైదరాబాద్, ఏప్రిల్ 29:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు  ఇంటికి జగన్ వెళ్లడం రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. మోహన్ బాబును తన పార్టీలోకి ఆహ్వానించేందుకు జగన్ ఆయన ఇంటికి వెళ్లి ఉంటారని పలువురు భావిస్తుండగా,  త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరుపతిలో మద్దతు కోసం కూడా వెళ్లి ఉండారనే ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు ఇటీవల తన అరవయ్యో పుట్టిన రోజు సందర్భంగా రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏ రాజకీయ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని తన పుట్టిన రోజు వేడుకలకు చాలా రోజుల తర్వాత ప్రత్యేకంగా పిలవడంతో మోహన్ బాబు టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపించాయి.ఇలాంటి సమయంలో అదీ ఉప ఎన్నికలకు ముందు జగన్ ఆయన ఇంటికి వెళ్లడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలను కూడా పరిశీలకులు కొట్టి పారేయడం లేదు. అయితే తమ మధ్య ఎలాంటి రాజకీయపరమైన చర్చ జరగలేదని కలెక్షన్ కింగ్  అంటున్నారు. మరోవైపు  కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే జగన్ -మోహన్ బాబు ను హీరోను కలిశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెబుతున్నారు. న్నట్లుగా తెలుస్తోంది. మరి రాజకీయ సమీకరణాలు ఏమైనా మారుతాయా లేదో చూడాలి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...