Sunday, April 29, 2012

మదురై పీఠాధిపతిగా వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద

చెన్నై,ఏప్రిల్ 30:  ప్రతిష్టాత్మక మదురై ఆధ్యాత్మిక పీఠం 293వ పీఠాధిపతిగా వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద నియమితులయ్యారు. దుష్టశక్తులు ఎన్ని కుట్రలు పన్నినా భక్తులంతా తన వెంటే ఉన్నారని ఆయన  ఈ సందర్భంగా అన్నారు. తన పీఠానికి సంబంధించి 40 దేశాల్లో ఆశ్రమాలు ఉన్నాయన్నారు. మొత్తం 1.2 కోట్ల మంది భక్తులు తన వెంట ఉన్నారని, ఆరోపణలకు చట్టబద్ధంగానే సమాధానమిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు, మదురై మఠాధిపతిగా నిత్యానంద నియామకాన్ని పలువురు భక్తులు వ్యతిరేకించారు. ఆరోపణలు సమసిపోయాకే పదవిని చేపట్టాలని డిమాండ్ చేశారు.  కాగా , ఈ వ్యవహారంలో తాము తలదూర్చబోమని వీహెచ్‌పీ, బీజేపీ నేతలు ప్రకటించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...