కొడుక్కి తిరుపతి టిక్కెట్ కోసం చిరు ఇంటికి గల్లా...

హైదరాబాద్, ఏప్రిల్ 29:  మంత్రి గల్లా అరుణ కుమారి ఆదివారం రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. తిరుపతి కాంగ్రెసు పార్టీ టిక్కెట్ తన తనయుడు గల్లా జయదేవ్‌కు వచ్చే విధంగా మద్దతు ఇవ్వాలని ఆమె చిరంజీవిని కోరారు. గల్లా అరుణ తన తనయుడు గల్లా జయదేవ్‌తో కలిసి చిరంజీవి ఇంటికివెళ్లారు.  కాగా, చిరంజీవి   తిరుపతి అభ్యర్థిగా అధిష్టానం వద్ద వెంకట రమణ పేరును ప్రతిపాదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. జయదేవ్‌కు టిక్కెట్ ఇప్పించేందుకు చిరు సుముఖంగా లేరనే వార్తలు కూడా  వచ్చాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వెంకట రమణ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా గల్లా అరుణ కుమారి తన తనయుడి కోసం చిరును కలిశారు. తన తనయుడికి సీటు ఇస్తే ఎలా గెలుస్తాడో పూర్తి సర్వే వివరాలు చిరుకు వారు వివరించినట్లుగా తెలుస్తోంది. అయితే చిరంజీవి కూడా జయదేవ్ పేరును కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని గల్లా అరుణకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు