Monday, April 30, 2012

యాజమాన్య హక్కులపై సుప్రీం సంచలన తీర్పు

న్యూఢిల్లీ,ఏప్రిల్ 29:  ఏదైనా  ఒక స్థలం సంరక్షకులు లేదా ఏజెంట్ల అధీనంలో దీర్ఘకాలంగా ఉన్నంత మాత్రాన ఆస్తిపై వారికి యాజమాన్య హక్కులు సంక్రమించబోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భూమిని పర్యవేక్షించేందుకు నియమించిన కాపలాదారుడు (వాచ్‌మన్), సంరక్షకుడు, సేవకుడికి దానిపై హక్కులు దఖలు పడబోవని పేర్కొంది. ఆస్తి ఎన్నేళ్లుగా వారి సంరక్షణలో ఉన్నప్పటికీ ఇదే సూత్రం వర్తిస్తుందని తెలిపింది. యజమాని కోరగానే ఆస్తిని తిరిగి అప్పగించాల్సిన బాధ్యత వారిపై ఉందని జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ఈమేరకు రెండు తరాలుగా తమ కుటుంబ పర్యవేక్షణలో ఉన్న స్థలంపై యాజమాన్య హక్కులు కల్పించాలని కోరుతూ ఓ వాచ్‌మన్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. 
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...