మావోల చెర నుంచి ఇటాలియన్ కు విముక్తి
భువనేశ్వర్,ఏప్రిల్ 12: : మావోయిస్టుల చెరలో ఉన్న ఇటలీ దేశస్తుడు పౌలో బొసెస్కోకు ఎట్టకేలకు విముక్తి లభించింది. గత నెల 14న ఒడిశాలో కిడ్నాప్ చేసిన అతన్ని 29 రోజుల అనంతరం మావోయిస్టులు విడుదల చేశారు. కంథమాల్ - మోహన అటవీప్రాంతంలో పౌలోను విడిచి పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో దాదాపు నెల రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాగా, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే హికాక ఇంకా మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. నేడో, రేపో ప్రజాకోర్టు నిర్వహిస్తామని, ప్రజల నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే హికాక విడుదలపై నిర్ణయం తీసుకుంటామని మావోయిస్టులు ప్రకటించారు. కాగా మరో ఇటలీ దేశస్తుడు క్లోడియోను మార్చి 24న మావోయిస్టులు విడుదల చేసిన విషయం తెలిసిందే.
Comments