హైదరాబాద్,ఏప్రిల్ 8: అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న హైదరాబాద్ లోని మాదన్నపేట, సైదాబాద్, చంచల్గూడ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్టు నగర పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. వదంతులను నమ్మొద్దొని ప్రజలను కోరారు. అదనపు బలగాలు మొహరిస్తున్నామని, ఆందోళన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఏకే ఖాన్ తెలిపారు. మాదన్నపేటలో ఆదివారం ఉదయం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అల్లరిమూకలు ఆర్టీసీ బస్సులపై రాళ్లు విసిరాయి. దీంతో 10 బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేసి అల్లరిమూకలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసు బలగాలను మొహరించారు. ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. మరోవైపు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అవసరమైతే మరిన్ని బలగాలు తరలించాలని ఆదేశించారు. రాష్ట్రమంతా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment