56 దేశాల్లో ఎయిర్ ఇండియా సేల్స్ ఏజెంట్లు
ముంబై,ఏప్రిల్ 8: టిక్కెట్ల అమ్మకాలు, పంపిణీ యంత్రాగాన్ని విస్తరించాలని ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దీనిలో భాగంగా 56 దేశాల్లో జనరల్ సేల్స్ ఏజెంట్స్ (జీఎస్ఏ )లను నియమించాలని నిర్ణయం తీసుకుంది. జీఎస్ఏలు నిర్దేశిత దేశం లేదా ప్రాంతంలో ఎయిర్ ఇండియాకు సేల్స్ రిప్రజెంటేటివ్లుగా పనిచేస్తారు. టిక్కెట్లు, కార్గో స్పేస్ అమ్మడంతో పాటు ప్రయాణికులకు తగిన సమాచారం అందించడంలో జీఎస్ఏలు సహాయపడతారు. మొదట 5 సంవత్సరాలకు కాంట్రాక్టు పద్ధతిలో వీరిని నియమిస్తారు. పనితీరు ఆధారంగా గడువు పొడిగింపు ఉంటుంది.
Comments