26/11 సూత్రదారి హఫీజ్పై అమెరికా భారీ రివార్డ్
వాషింగ్టన్ ,ఏప్రిల్ 3: 26/11 ముంబయి ఉగ్రవాద దాడులకు కుట్ర చేసిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్ను పట్టించిన వారికి 10 మిలియన్ల డాలర్ల బహుమతిని అమెరికా ప్రకటించింది. అమెరికా నిర్ణయంపై భారత దేశం హర్షం ప్రకటించింది. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ స్పందిస్తూ హఫీజ్ పాకిస్తాన్లోనే ఉన్నారని అన్నారు. కుట్రదారులను పట్టివ్వాలని తాము పాక్ను ఎన్నిసార్లు కోరినా స్పందించలేదని విమర్శించారు. హఫీజ్ సయిదా ఎఫ్బిఐ జాబితాలో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది. ఇతను ప్రస్తుతం పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు భావిస్తున్నారు. హఫీజ్ పైన ఉన్న పలు కేసులను లాహోర్ కోర్టు తోసిపుచ్చింది.

Comments