కలెక్టర్ విడుదలపై 25 వరకూ మావోల డెడ్ లైన్

కొడుకుతో కలెక్టర్ (ఫైల్ ఫొటో)
ఛత్తీస్ గఢ్,ఏప్రిల్ 22:  ఛత్తీస్ గఢ్ లోని  సుకుమా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ ను కిడ్నాప్ చేసిన  మావోయిస్టులు ఆయన విడుదలకు షరతులు విధించారు. కలెక్టర్ విడుదలకు మంగళవారం వరకూ మావోలు చత్తీస్ గడ్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. జైలులో ఉన్న 12మంది మావోయిస్టు నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఓ ఆడియో టేపును విడుదల చేశారు. బస్తర్ లో ఉన్న పారా మిలటరీ దళాలను ఉపసంహరించుకోవటంతో పాటు, ఆపరేషన్ గ్రీన్ హంట్ నిలిపివేయాలని కూడా మావోయిస్టులు డిమాండ్ చేశారు. కాగా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ క్షేమంగా ఉన్నట్లు ఛత్తీస్ గఢ్ పోలీసులు తెలిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు