Saturday, April 21, 2012

భద్రాచలంలో అతిరాత్రం మహాయాగం

భద్రాచలం,ఏప్రిల్ 21: : భద్రాచలంలో అతిరాత్రం మహాయాగం ప్రారంభమైంది. సీతారాముల ఆలయం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న 'ఎటపాక'లో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ మహాక్రతువులో పాల్గొనేందుకు వివిధ పీఠాధిపతులు, కేరళ నుంచి నంబూద్రి వంశీయులు భద్రాద్రి చేరుకున్నారు. ఈ మహత్కర్యాన్ని వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు భద్రాచలం తరలి వస్తున్నారు. లోకకళ్యాణం కోసం పన్నెండు రోజులు నిర్వహించే ఈ సోమ యాగం మే 2న ముగియనుంది. సూత్యం అనే ప్రక్రియతో జరిగే పూర్ణాహుతితో మే 2న యాగం పూర్తవుతుంది. ప్రకృతిని పరిశుద్ధం చేసి విశ్వశాంతితోపాటు జన్మరాహిత్యాన్ని ప్రసాదించే అతిరాత్రంపై సామాన్యులు, వేదపండితులే కాకుండా శాస్త్రజ్ఞులు కూడా ఈ యజ్ఞ వేదిక వైపు దృష్టి సారించారు. నిష్ఠాగరిష్ఠంగా చేసే ఈ క్రతువుపై పరిశోధనలు చేసేందుకు దేశవిదేశాలనుంచి శాస్త్రజ్ఞులు అతిరాత్రం వేదికకు విచ్చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...