ఈనెల 26న పీఎస్‌ఎల్‌వీ సీ19 ప్రయోగం

నెల్లూరు,ఏప్రిల్ 23:  పీఎస్‌ఎల్‌వీ సీ19 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 26వ తేదీన ఉదయం 5.47 గంటలకు సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం -షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ19 ప్రయోగం జరుగుతుందని షార్ వర్గాలు ప్రకటించాయి. 70 గంటల ముందు . అంటే సోమవారం ఉదయం 6.47 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమయింది. రూ.498 కోట్లతో చేపట్టిన ఈ ప్రయోగంలో ఉపగ్రహానికి రూ.378 కోట్లు, రాకెట్‌కు రూ.120 కోట్లు వ్యయం చేస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ19 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 1,830 కిలోలు బరువు కలిగిన రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం-1 (రిశాట్-1) ను 480 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువకక్ష (సన్ సింక్రోనస్ ఆర్బిట్) లోకి ప్రవేశపెడతారు. అనంతరం రిశాట్-1 లోని ద్రవ ఇంధన ఇంజన్ల సాయంతో 536 కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల కంటే ఇది అతిపెద్ద ఉపగ్రహం కావడంతో చంద్రయాన్-1 కు వినియోగించిన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను ఉపయోగిస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 20 ప్రయోగాలు చేయగా, 19 విజయవంతమయ్యాయి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు