Monday, April 23, 2012

ఈనెల 26న పీఎస్‌ఎల్‌వీ సీ19 ప్రయోగం

నెల్లూరు,ఏప్రిల్ 23:  పీఎస్‌ఎల్‌వీ సీ19 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 26వ తేదీన ఉదయం 5.47 గంటలకు సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం -షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ19 ప్రయోగం జరుగుతుందని షార్ వర్గాలు ప్రకటించాయి. 70 గంటల ముందు . అంటే సోమవారం ఉదయం 6.47 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమయింది. రూ.498 కోట్లతో చేపట్టిన ఈ ప్రయోగంలో ఉపగ్రహానికి రూ.378 కోట్లు, రాకెట్‌కు రూ.120 కోట్లు వ్యయం చేస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ19 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 1,830 కిలోలు బరువు కలిగిన రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం-1 (రిశాట్-1) ను 480 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువకక్ష (సన్ సింక్రోనస్ ఆర్బిట్) లోకి ప్రవేశపెడతారు. అనంతరం రిశాట్-1 లోని ద్రవ ఇంధన ఇంజన్ల సాయంతో 536 కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల కంటే ఇది అతిపెద్ద ఉపగ్రహం కావడంతో చంద్రయాన్-1 కు వినియోగించిన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను ఉపయోగిస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 20 ప్రయోగాలు చేయగా, 19 విజయవంతమయ్యాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...