జూన్ 12న ఉప ఎన్నికలు

న్యూఢిల్లీ,ఏప్రిల్ 24: రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగింది. 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి జూన్ 12న  పోలింగ్ జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉప ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 18న ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు మే25 తుది గడువు. మే 28వ తేదీలోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.  జూన్ 15న ఓట్ల లెక్కింపు చేపడతారు. నర్సన్నపేట, పాయకరావుపేట, రామచంద్రాపురం, పోలవరం, నర్సాపురం, పత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, అనంతపురం, రాయదుర్గం, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డతో పాటు తెలంగాణ ప్రాంతంలోని పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల్కు,  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు  జరగనున్నాయి..గత సంవత్సరం డిసెంబరులో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చందిన పదహారు మంది శాసనసభ్యులపై స్పీకర్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆళ్లగడ్డకు చెందిన శోభా నాగి రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు.  ఇక చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో తిరుపతి స్థానం ఖాళీ అయింది. సిబిఐ ఎఫ్ఐఆర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు ఉన్నదని మేకపాటి రాజమోహన్ రెడ్డి తన నెల్లూరు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు.  కాగా షెడ్యూలు విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.  ఎన్నికలు జరుగనున్న 18 శాసనసభ నియోజకవర్గాల్లో 44,01,392మంది ఓటర్లు ఉన్నారు.  5,405 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు