హైదరాబాద్,మార్చి 7: రాష్ట్రంలో సైకిల్ కు తుప్పుపట్టిందని, ఇక ముందుకు పోదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అయిదు రాష్ట్రాల ఫలితాలు తాత్కాలిక విఘాతం మాత్రమేనని చెప్పారు. యు.పి.లో ఎస్ పి మేనిఫెస్టోలో ఉన్న హామీలు అన్నీ ఇక్కడ అమలు చేస్తున్నవేనని అన్నారు. ఉప ఎన్నికలు జరుగవలసిన 17 స్థానాల్లో ఇన్ చార్జ్ లను నియమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేనే ఎన్నికలలో గెలుపు సాధ్యం అన్నారు. ఉప ఎన్నికలలో పోటీ గట్టిగానే ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్నికలనాటి పరిస్థితులను బట్టే ఫలితాలు ఉంటాయని, అభివృద్ధి ఒక్కటే ఓటుకు ప్రాతిపదిక కాద వ్యఖ్యానించారు. ప్రజలలోకి వెళ్లి ఓటు అడగటానికి అభివృద్ధి కావాలని చెప్పారు. తాను అనుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ గెలవదని, ప్రజలు కూడా అనుకోవాలని ఆయన అన్నారు. అంతిమ ఫలితాలకు ఓటర్లదే బాధ్యత అని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment