ఓటర్లదే బాధ్యత...

హైదరాబాద్,మార్చి 7:  రాష్ట్రంలో సైకిల్ కు తుప్పుపట్టిందని, ఇక ముందుకు పోదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అయిదు రాష్ట్రాల ఫలితాలు తాత్కాలిక విఘాతం  మాత్రమేనని చెప్పారు. యు.పి.లో ఎస్ పి మేనిఫెస్టోలో ఉన్న హామీలు అన్నీ ఇక్కడ అమలు చేస్తున్నవేనని అన్నారు.  ఉప ఎన్నికలు జరుగవలసిన 17 స్థానాల్లో ఇన్ చార్జ్ లను నియమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేనే ఎన్నికలలో గెలుపు సాధ్యం అన్నారు. ఉప ఎన్నికలలో పోటీ గట్టిగానే ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్నికలనాటి పరిస్థితులను బట్టే ఫలితాలు ఉంటాయని,  అభివృద్ధి ఒక్కటే ఓటుకు ప్రాతిపదిక కాద వ్యఖ్యానించారు.  ప్రజలలోకి వెళ్లి ఓటు అడగటానికి అభివృద్ధి కావాలని చెప్పారు. తాను అనుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ గెలవదని, ప్రజలు కూడా అనుకోవాలని ఆయన అన్నారు. అంతిమ ఫలితాలకు ఓటర్లదే బాధ్యత అని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు