విఆర్ ఓ, విఆర్ ఎ పరీక్షా ఫలితాల విడుదల

హైదరాబాద్,మార్చి 12: : విఆర్ ఓ, విఆర్ ఎ పరీక్షా ఫలితాలను మంత్రి రఘువీరా రెడ్డి విడుదల చేశారు. ఉప ఎన్నికల కారణంగా వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నెల్లూరు, మహబూబ్ నగర్ జిల్లాల ఫలితాలను నిలిపివేశారు.  ఈ ఫలితాలను jntucgg.nic.in వెబ్ సైట్ లో చూడవచ్చు. ఎంపిక విధానం మూడు దశలలో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంపిక, శిక్షణ, నియామక ఉత్తర్వులు అనే మూడు దశలలో జరుగుతుంది. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. సర్టిఫికెట్లు అన్ని సక్రమంగా ఉంటే అదే రోజు ఎంపికైనట్లు ఉత్తర్వులు ఇస్తారు. ప్రస్తుతం జనరల్ మెరిట్ జాబితాని మాత్రమే ప్రకటించారు. 15న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శిక్షణ ఉంటుందని సిసిఎల్ ఎ కమిషనర్ జె. .సత్యనారాయణ తెలిపారు.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు