Monday, March 12, 2012

విఆర్ ఓ, విఆర్ ఎ పరీక్షా ఫలితాల విడుదల

హైదరాబాద్,మార్చి 12: : విఆర్ ఓ, విఆర్ ఎ పరీక్షా ఫలితాలను మంత్రి రఘువీరా రెడ్డి విడుదల చేశారు. ఉప ఎన్నికల కారణంగా వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నెల్లూరు, మహబూబ్ నగర్ జిల్లాల ఫలితాలను నిలిపివేశారు.  ఈ ఫలితాలను jntucgg.nic.in వెబ్ సైట్ లో చూడవచ్చు. ఎంపిక విధానం మూడు దశలలో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంపిక, శిక్షణ, నియామక ఉత్తర్వులు అనే మూడు దశలలో జరుగుతుంది. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. సర్టిఫికెట్లు అన్ని సక్రమంగా ఉంటే అదే రోజు ఎంపికైనట్లు ఉత్తర్వులు ఇస్తారు. ప్రస్తుతం జనరల్ మెరిట్ జాబితాని మాత్రమే ప్రకటించారు. 15న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శిక్షణ ఉంటుందని సిసిఎల్ ఎ కమిషనర్ జె. .సత్యనారాయణ తెలిపారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...