సుప్రీం నోటీసులపై శాసనసభలో గందరగోళం

హైదరాబాద్,మార్చి 12: జగన్ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆరుగురు రాష్ట్ర మంత్రులకు నోటీసులు జారీచేయడంపై శాసనసభలో గందరగోళం చెలరేగింది. ఆరుగురు మంత్రులు రాజీనామా చేయాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీనిపై సభలో చర్చించాలని గట్టిగా పట్టుబట్టారు. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ మీడియాలో వచ్చిన అంశాలపై సభలో చర్చించడం సరికాదన్నారు. అసత్యాలను సభకు తీసుకొచ్చి చర్చించాలని కోరడం సబబు కాదన్నారు. కోర్టు ఏం చెప్పిందో తనకు తెలియదన్నారు. వాస్తవాలు తెలిశాక అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమన్నారు. అధికార, ప్రతిపక్ష వాదోపవా దాలతో సభ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ సభను  వాయిదా వేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు