హైదరాబాద్,మార్చి 29: శాసనసభ బడ్జెట్ సమావేశాల తంతు ముగిసింది. సభ గురువారం నిరవధికంగా వాయిదాపడింది. విపక్షాల రసాభాస మధ్యనే చివరిరోజు సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగాయి. సభ్యుల నిరసనల మధ్యనే మూజువాణీ ఓటుతో ద్రవ్య వినిమయ బిల్లును డిప్యుటీ స్పీకర్ భట్టీ విక్రమార్క ఆమోదించారు. 28 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అధిక శాతం సభాసమయం వృధా అయిందే తప్ప ప్రజా సమస్యలపై చర్చలు సరిగా జరగలేదు. చర్చ లేకుండానే మూజువాణీ ఓటుతో పద్దులు ఆమోదం పొందగా మధ్యలో ఉపఎన్నికల హడావిడి, ఆపై మద్యం సిండికేట్ వ్యవహారం, తెలంగాణ అంశంపై సభ అట్టుడికింది. కాగా నెల్లూరు జిల్లా కోవూరు నుంచి ఎన్నికైన వైఎస్ఆర్ పార్టీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ చివరి రోజున సభలో ప్రమాణ స్వీకారం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment