ముగిసిన అసెంబ్లీ గోల...
హైదరాబాద్,మార్చి 29: శాసనసభ బడ్జెట్ సమావేశాల తంతు ముగిసింది. సభ గురువారం నిరవధికంగా వాయిదాపడింది. విపక్షాల రసాభాస మధ్యనే చివరిరోజు సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగాయి. సభ్యుల నిరసనల మధ్యనే మూజువాణీ ఓటుతో ద్రవ్య వినిమయ బిల్లును డిప్యుటీ స్పీకర్ భట్టీ విక్రమార్క ఆమోదించారు. 28 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అధిక శాతం సభాసమయం వృధా అయిందే తప్ప ప్రజా సమస్యలపై చర్చలు సరిగా జరగలేదు. చర్చ లేకుండానే మూజువాణీ ఓటుతో పద్దులు ఆమోదం పొందగా మధ్యలో ఉపఎన్నికల హడావిడి, ఆపై మద్యం సిండికేట్ వ్యవహారం, తెలంగాణ అంశంపై సభ అట్టుడికింది. కాగా నెల్లూరు జిల్లా కోవూరు నుంచి ఎన్నికైన వైఎస్ఆర్ పార్టీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ చివరి రోజున సభలో ప్రమాణ స్వీకారం చేశారు.
.jpg)
Comments