భారత జెండాకు అవమానం

ఉక్రెయిన్  యువతులపై క్రిమినల్ కేసు
మాస్కో,ఫిబ్రవరి 19:  వీసా నిబంధనలు కఠినతరం చేసినందుకు నిరసనగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జరిగిన ‘అర్ధ నగ్న’ నిరసనలో భారత జెండాను చింపి,  అవమానించిన యువతులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఉక్రెయిన్ పోలీసులు తెలిపారు.  వారు దోషులుగా తేలితే నాలుగేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. పర్యాటక వీసాపై దేశానికి వచ్చే ఉక్రెయిన్ మహిళల వివరాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని భారత విదేశాంగ శాఖ జారీ చేసిన ఆదేశాలకు నిరసనగా వారీ ఆందోళనకు దిగారు. ఇటీవలి కాలంలో మధ్య ఆసియా దేశాల మహిళలు సెక్స్ రాకెట్లలో ఎక్కువగా ఉంటున్నందున.. దాన్ని నియంత్రించేందుకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయన్న భారత్ మీడియా కథనాలు వారిని మరింత ఆగ్రహానికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో గత నెలలో కీవ్‌లోని భారత రాయబారి నివాసం వద్ద ‘ఫెమెన్’ గ్రూపు కార్యకర్తలు నిరసనకు దిగారు. వీరిలో కొందరు రాయబారి నివాసం బాల్కనీ ఎక్కి.. బట్టలిప్పేసి.. ‘నేను ఉక్రెయిన్ వ్యభిచారిణి కాదు’ అంటూ నినాదాలు చేశారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు