Saturday, February 18, 2012

భారత జెండాకు అవమానం

ఉక్రెయిన్  యువతులపై క్రిమినల్ కేసు
మాస్కో,ఫిబ్రవరి 19:  వీసా నిబంధనలు కఠినతరం చేసినందుకు నిరసనగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జరిగిన ‘అర్ధ నగ్న’ నిరసనలో భారత జెండాను చింపి,  అవమానించిన యువతులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఉక్రెయిన్ పోలీసులు తెలిపారు.  వారు దోషులుగా తేలితే నాలుగేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. పర్యాటక వీసాపై దేశానికి వచ్చే ఉక్రెయిన్ మహిళల వివరాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని భారత విదేశాంగ శాఖ జారీ చేసిన ఆదేశాలకు నిరసనగా వారీ ఆందోళనకు దిగారు. ఇటీవలి కాలంలో మధ్య ఆసియా దేశాల మహిళలు సెక్స్ రాకెట్లలో ఎక్కువగా ఉంటున్నందున.. దాన్ని నియంత్రించేందుకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయన్న భారత్ మీడియా కథనాలు వారిని మరింత ఆగ్రహానికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో గత నెలలో కీవ్‌లోని భారత రాయబారి నివాసం వద్ద ‘ఫెమెన్’ గ్రూపు కార్యకర్తలు నిరసనకు దిగారు. వీరిలో కొందరు రాయబారి నివాసం బాల్కనీ ఎక్కి.. బట్టలిప్పేసి.. ‘నేను ఉక్రెయిన్ వ్యభిచారిణి కాదు’ అంటూ నినాదాలు చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...