Tuesday, December 13, 2011

జడ్జీల్లో జవాబుదారీతనం పెంచే బిల్లు ఆమోదం

న్యూఢిల్లీ,డిసెంబర్ 14:    అన్నా హజారే బృందం లోక్‌పాల్ పరిధిలోకి తేవాలని పట్టుబడుతున్న న్యాయ వ్యవస్థ ప్రమాణాలు-జవాబుదారీ బిల్లు-2010 కు  కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడతారు.  జడ్జీల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జీల దుష్ర్పవర్తన లేదా అనర్హతకు సంబంధించి అందే వ్యక్తిగత ఫిర్యాదులపై విచారణ, అందుకు అనుసరించాల్సిన పద్ధతులను ఈ బిల్లులో పొందుపరిచారు.ఒకే కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించకుండా జడ్జీలు దూరం పాటించడాన్ని తప్పనిసరి చేయాలని బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. కేసుల విచారణ సందర్భంగా జడ్జీలు రాజ్యాంగబద్ధ సంస్థలు లేదా వ్యక్తులపై అనవసర వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలనే నిబంధనను ఈ బిల్లులో ప్రభుత్వం తొలుత ఆమోదించింది. అయితే కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలిపిందా లేదా అనే విషయం తెలియరాలేదు.. కాగా, విజిల్‌బ్లోయర్స్ భద్రత బిల్లు-2010, సిటిజన్స్ చార్టర్ బిల్లు-2011 లకు కూడా కేబినెట్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిటి జన్స్ చార్టర్ (పౌర సేవల జాబితా)లో పౌరులకు అధికారులు నిర్ణీత వ్యవధిలోగా అందించాల్సిన సేవలను ఈ బిల్లులో పొందుపరిచారు. అయితే 15 రోజుల వ్యవధి చాలా తక్కువని కొందరు మంత్రులు అభిప్రాయపడటంతో చివరకు 30 రోజుల వ్యవధిగా నిర్ణయించారు.
విజిల్‌బ్లోయర్స్ భద్రత బిల్లులో కేంద్ర మంత్రి మండలి, న్యాయ వ్యవస్థ, కార్పొరేట్లను దీని పరిధిలోకి తేవాలని ప్రతిపాదన ఉంది.అలాగే మనీలాండరింగ్ నిరోధక బిల్లులో సవరణలకు అంగీకారం తెలిపింది. అయితే ఆహార భద్రత బిల్లుపై చర్చ జరిగినా దానిపై కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ బిల్లుపై నిర్ణయాన్ని 18న జరగనున్న సమావేశానికి వాయిదా వేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...