స్వరాజ్ పాల్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
లండన్ ,డిసెంబర్ 14: బ్రిటన్లో ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ మారియెట్ హోటల్ జరిగిన ఓ కార్యక్రమంలో అందజేశారు. వివిధ రంగాల్లో ఎనలేని కృషిని చేసినందుకు ఈ అవార్డును స్వరాజ్పాల్కు భారతీయ కంపెనీ పవర్బ్రాండ్ ప్రకటించింది. తనకు అందజేసిన అవార్డును భారత ప్రజలకు స్వరాజ్పాల్ అంకితమిచ్చారు. లేబర్ పార్టీకి చెందిన రాజకీయవేత్తగానే కాకుండా, వాల్వెర్హాంప్టన్ యూనివర్సిటీ, వెస్ట్మినిస్టర్ యూనివర్సిటికి ఆయన చన్సలర్ గా సేవలందిస్తున్నారు. 1983 సంవత్సరంలో స్వరాజ్పాల్కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.

Comments