న్యూఢిల్లీ,డిసెంబర్ 14: జెమిని నక్షత్ర మండలం (మిథున రాశి) నుంచి బుధ, గురువారాల్లో వివిధ రంగులతో కూడిన ఉల్కాపాతం సంభవించనుందని సైన్స్ పాపులరైజేషన్ అసోసియేషన్ ఆఫ్ కమ్యూనికేటర్స్ అండ్ ఎడ్యుకేటర్స్ (స్పేస్) అధ్యక్షుడు సీబీ దేవగణ్ వెల్లడించారు. తూర్పు ఆకాశంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మధ్యస్థ వేగంతో రాలే ఈ జెమినైడ్స్ (మిథున రాశి ఉల్కలు) ను నేరుగా చూడవచ్చని ఆయన తెలిపారు. గంటకు 50 నుంచి 100 వరకు ఉల్కలు రాలే అవకాశముందన్నారు. సాధారణంగా భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయే తోకచుక్కల శకలాలను ఉల్కలుగా పిలుస్తారని, అయితే ప్రస్తుతం మిథునరాశిలోని ‘3200 ఫాథాన్’ అనే గ్రహశకలానికి చెందిన అవశేషాలు ఉల్కలుగా రా లనున్నాయని వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment