మిథున రాశి నుంచి ఉల్కాపాతం

న్యూఢిల్లీ,డిసెంబర్ 14:   జెమిని నక్షత్ర మండలం (మిథున రాశి) నుంచి బుధ, గురువారాల్లో వివిధ రంగులతో కూడిన ఉల్కాపాతం సంభవించనుందని సైన్స్ పాపులరైజేషన్ అసోసియేషన్ ఆఫ్ కమ్యూనికేటర్స్ అండ్ ఎడ్యుకేటర్స్ (స్పేస్) అధ్యక్షుడు సీబీ దేవగణ్ వెల్లడించారు. తూర్పు ఆకాశంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మధ్యస్థ వేగంతో రాలే ఈ జెమినైడ్స్ (మిథున రాశి ఉల్కలు) ను నేరుగా చూడవచ్చని ఆయన తెలిపారు. గంటకు 50 నుంచి 100 వరకు ఉల్కలు రాలే అవకాశముందన్నారు. సాధారణంగా భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయే తోకచుక్కల శకలాలను ఉల్కలుగా పిలుస్తారని, అయితే ప్రస్తుతం మిథునరాశిలోని ‘3200 ఫాథాన్’ అనే గ్రహశకలానికి చెందిన అవశేషాలు ఉల్కలుగా రా లనున్నాయని వివరించారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు