హైదరాబాద్,డిసెంబర్ 30: ఈ ఏడాది (2011లో) 4.90 లక్షల పాస్పోర్టులను జారీ చేసి రికార్డు నెలకొల్పామని సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ అధికారి శ్రీకర్రెడ్డి తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. తత్కాల్ దరఖాస్తులను మూడు రోజుల్లోనే పరిశీలించి పాస్పోర్టును జారీ చేస్తున్నామని శ్రీకర్రెడ్డి తెలిపారు. ఆన్లైన్ ద్వారా ప్రస్తుతం 200 దరఖాస్తులకు టోకెన్లు (స్లాట్స్) జారీ చేస్తున్నామని, దరఖాస్తుదారుల డిమాండ్ ఆధారంగా మరో 500 స్లాట్స్ ను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వారంరోజుల్లో ప్రతి నిత్యం 2,500 స్లాట్స్ను ఆన్లైన్ దరఖాస్తుదారులకు అందుబాటులో ఉంచుతామన్నారు. లోగడ తిరస్కృతికి గురైన దరఖాస్తుదారులు తిరిగి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుని స్లాట్ పొందే విధానం అమలులో ఉండేదన్నారు. ఇకపై వీరు ఎలాంటి టోకెన్ అక్కర్లేకుండా మూడు రోజుల్లో నేరుగా కార్యాలయానికొచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్తోపాటు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆరు పాస్పోర్టు సేవాకేంద్రాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. వీటి నుంచి ఇప్పటివరకు 20 వేల దరఖాస్తులు అందాయని, ఇందులో 6,500 పాస్పోర్టులను జారీ చేశామని చెప్పారు. త్వరలో కరీంనగర్లో మినీ పాస్పోర్టు సేవాకేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు శ్రీకర్రెడ్డి తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment