 |
| థానే తుపాను ప్రభావం వల్ల నెల్లూరులో భారీ వర్ష దృశ్యం |
చెన్నైడిసెంబర్ 30: థానే తుపాను శుక్రవారం తెల్లవారుజామున పుదుచ్చేరి, తమిళనాడులోని కడలూరు మధ్య తీరాన్ని తాకింది. ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు మరికొంత సమయం పడుతుందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో పుదుచ్చేరి, తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు సుమారు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. విద్యుత్ వ్యవస్థ చాలా చోట్ల దెబ్బతింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత కేంద్రాలకు తరలిస్తున్నారు. తీర ప్రాంతాల్లోని స్కూళ్లు, విద్యాసంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు జిల్లా తడ మండలం వేనాడు, ఇరక్కం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. థానే తుపాను ప్రభావం నెల్లూరు జిల్లా మీద తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లాలోని 13 తీరప్రాంత మండలాలు కల్లోలంగా ఉన్నాయి. తీర గ్రామాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులు కూడా తోడు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సముద్రం లో అలజడి ఎక్కువగా ఉండటంతో పాటు కావలి ,మైపాడు,తదితర ప్రాంతాల్లో సముంద్రం మరింత ముందుకు రావటంతో మత్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడ మండలం వేనాడు, ఇరక్కం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Comments