లోక్ 'బాల్ ' తో ఆడుకున్న పెద్దలు...!

ఆమోదం లేకుండానే శీతాకాల సమావేశాలు వాయిదా
న్యూఢిల్లీ,డిసెంబర్ 30: లోక్‌సభలో మూజువాణి ఓటుతో గట్టెక్కిన లోక్‌పాల్ బిల్లు  అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్ మక వైఖరితో అటకెక్కింది. పెద్దల సభలో దీనిని గట్టెక్కించేందుకు యూపీఏకు తగిన బలం లేకపోవడంతో అర్ధరాత్రి దాకా చర్చ తో సాగదీసి ఆఖరి నిమిషంలో గందరగోళానికి 'తావిచ్చి' సభను ఈ సారికి నిరవధిక వాయిదా వేయించడంలో సఫలీకృతమైంద్. బిల్లు బలహీనంగా ఉందంటూ చర్చ సందర్భంగా విపక్షాలు ధ్వజమెత్తాయి. అయినా అధికార కూటమి సవరణలు, మార్పుచేర్పుల జోలికిపోకుండా బిల్లుపై చర్చను సాగదీసింది. సరిగ్గా ఓటింగ్ సమయం వచ్చేసరికి.. విపక్షాలు బిల్లుకు 187 సవరణలను ప్రతిపాదించాయని, వీటిని పరిశీలించేందుకు సమయం కావాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి బన్సల్ సభ చైర్మన్‌ను కోరారు. దీంతో గందరగోళం తీవ్రతరం కావడంతో చైర్మన్ హమీద్ అన్సారీ అర్ధరాత్రి 12 గంటలు దాటాక సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, లోక్‌పాల్ బిల్లు మూలన పడదని, వచ్చే సమావేశాల్లో సభ ముందుకు తీసుకొస్తామని కేంద్ర న్యాయ శాఖ సల్మాన్ ఖుర్షీద్ మీడియాకు చెప్పారు. చర్చలో
 విపక్షాల సభ్యులు, అధికార పక్ష సభ్యులు పోటాపోటీగా 'ప్రసంగించారు'. వ్యతిరేకిస్తూ కొందరు, సమర్థిస్తూ కొందరు... కొన్ని అంశాలనే వ్యతిరేకిస్తూ కొందరు, వ్యతిరేకించినా మద్దతిస్తూ కొందరు, అసలు లోక్‌పాల్ అవసరమేమిటని ఇంకొందరు... ఇలా ప్రసంగిస్తూనే వచ్వ్హారు. . రాత్రి 11.30 గంటల సమయానికిగానీ... వీరికి రాజ్యాంగ నిబంధనలు గుర్తుకు రాలేదు. శీతాకాల సమావేశాల గడువు అర్ధరాత్రి 12 గంటల తో ముగుస్తున్నందున చర్చ కొనసాగించే అవకాశంలేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  పవన్‌కుమార్ బన్సల్ 'చావు కబురు చల్ల'గా చెప్పారు.  "విపక్ష సభ్యులు 187 సవరణలను ప్రతిపాదించారు. వీటన్నింటినీ ఇప్పుడు చేపట్టలేం. ఆ తర్వాత సంప్రదింపులు జరపాలన్నా కనీసం మూడు రోజులు పడుతుంది. కానీ... కొన్ని రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయంటూ తేల్చేశారు. దీనితో గంద్రగోళం తార స్థాయికి చేరడంతో  సభాధ్యక్షుడు  సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో... అర్ధరాత్రి వేళ  జాతి ఆకాంక్షించిన లోక్‌పాల్‌ బిల్లు అటకెక్కింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు