కేబుల్ టీవీ డిజిటలైజేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ,డిసెంబర్ 14:  తక్కువ ధరకే నాణ్యమైన టీవీ ప్రసారాలను అందించేందుకు ఉద్దేశించిన కేబుల్ టీవీ డిజిటలైజేషన్ బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు వల్ల కేబుల్ ఆపరేటర్లకు ఎటువంటి నష్టం ఉండదని హామీ ఇచ్చింది. అనలాగ్ టీవీ నెట్‌వర్క్ నుంచి డిజిటలైజేషన్‌కు మారడం వల్ల భారత్ కూడా అమెరికా, బ్రిటన్, కొరియా, తైవాన్‌ల సరసన చేరుతుందని తెలిపింది.  ఈ సందర్భంగా జరిగిన చర్చలో సమాచార, ప్రసారశాఖ మంత్రి అంబికా సోని  మాట్లాడుతూ, ఈ బిల్లు వల్ల సెట్ టాప్ బాక్సుల ధరలు తగ్గుతాయని, వాయిదా పద్ధతుల్లో, అద్దెకు కూడా దొరుకుతాయని వివరించారు. అలాగే వీక్షకులు తమకు అవసరంలేని చానళ్లను తీసుకోవాల్సిన అగత్యం తప్పుతుందన్నారు. చానళ్ల సంఖ్యను కలిగి ఉండటంపై ట్రాయ్ పరిమితి విధించనుందని చెప్పారు. అన్నింటికన్నా ముఖ్యంగా చానళ్ల టీఆర్పీ రేటింగ్‌ల గొడవకు ఈ బిల్లు తెరదించుతుందని సోని వివరించారు. ఇకపై చందాదారుల జాబితానే దీన్ని నిర్ణయిస్తుందన్నారు. నిబంధనలు అతిక్రమించే కేబుల్ ఆపరేటర్ల లెసైన్సుల రద్దుకు ఈ బిల్లుకు అవకాశం కల్పిస్తుందన్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు