Thursday, December 8, 2011

వీరేంద్రుని వీరంగం...!

ఇండోర్, డిసెంబర్ 9: నాలుగు దశాబ్దాల వన్డే చరిత్రలో అద్భుత  ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ కాలం లో రెండే డబుల్ సెంచరీలు నమోదు కాగా... ఆ రెండింటినీ భారతీయులే సాధించడం  విశేషం. వెస్టిండీస్‌తో గురువారం ఇండోర్‌లో జరిగిన నాలుగో వన్డేలో సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించాడు. 219 పరుగులతో  సచిన్ (200 నాటౌట్) రికార్డును అధిగమించాడు. సచిన్ (గ్వాలియర్), సెహ్వాగ్ (ఇండోర్) డబుల్ సెంచరీలు సాధించిన రెండు మైదానాలు మధ్యప్రదేశ్‌లోనివే. పరుగుల వరద పారించిన ఈ రెండు పిచ్‌లకు క్యూరేటర్ ఒక్కరే (సమందర్ సింగ్).
బౌండరీల ద్వారా ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్ మన్‌గా సెహ్వాగ్ (142) రెండో స్థానంలో నిలిచాడు. వాట్సన్ (150) ముందు ఉన్నాడు.
ఇన్నింగ్స్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన సచిన్ (25) రికార్డును వీరూ (25) సమం చేశాడు.
సిరీస్ కైవసం
వీరూ ధాటికి భారత్ -వన్డేల్లో  అత్యధిక స్కోరు-418/5 ను నమోదు చేసింది.   టీమిండియా 153 పరుగుల భారీ తేడాతో నెగ్గి సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 418 పరుగుల భారీ స్కోరు సాధించింది. సెహ్వాగ్ విజృంభణకు తోడు ఓపెనర్ గంభీర్ (67 బంతుల్లో 67; ఫోర్లు 11), రైనా (44 బంతుల్లో 55; ఫోర్లు 6) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం విండీస్ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటయ్యింది. రామ్‌దిన్ (96 బంతుల్లో 96; ఫోర్లు 12) సెంచరీ చేజార్చుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సెహ్వాగ్‌ కు దక్కింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...