Thursday, December 8, 2011

చిదంబరంపై ఫిర్యాదులో సాక్షిగా సుబ్రమణ్య స్వామి

న్యూఢిల్లీ,డిసెంబర్ 8:  2జి స్పెక్ట్రమ్  కేసులో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంపై చేసిన ఫిర్యాదుపై సాక్షిగా మారేందుకు ఢిల్లీ కోర్టు జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామికి అనుమతి ఇచ్చింది. వాంగ్మూలం ఇవ్వడానికి ఈ నెల 17వ తేదీన విట్నెస్ బాక్స్ లో  హాజరు కావాలని స్వామిని కోర్టు ఆదేశించింది. ఆయన వాంగ్మూలం ఇచ్చిన తర్వాత 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిదంబరం పాత్ర ఉందంటూ చేసిన ఫిర్యాదును పరిశీలిస్తుంది. కేసులో చిదంబరాన్ని కూడా భాగస్వామిని చేయాలని స్వామి కోర్టును కోరారు. తీహార్ జైలులో ఉన్న టెలికం మాజీ మంత్రి ఎ రాజాతో కలిసి చిదంబరం స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయించారని స్వామి ఆరోపించారు. స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయించడానికి రాజా, చిదంబరం మధ్య నాలుగు సమావేశాలు జరిగాయని ఆయన చెప్పారు. రాజాతో అప్పటి ఆర్థిక మంత్రి మాట్లాడారని ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనను కూడా ఆయన ప్రస్తావించారు. స్పెక్ట్రమ్ ధరలపై రాజా, చిదంబరం కలిసే ఫార్ములాను రూపొందించారని ఆయన అన్నారు. విదేశీ కంపెనీలకు లైసెన్సుల విక్రయానికి అప్పటి ఆర్థిక మంత్రి అనుమతి ఇచ్చారని రాజా ఫైలులో, పత్రికా ప్రకటనలో నోట్ చేశారని ఆయన చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...